కేటీఆర్’ని కలిసిన హనుమ విహారి


టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. విహారిని కేటీఆర్‌ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విహారి.. తన బ్యాట్‌ను కేటీఆర్‌కు గిఫ్ట్ గా అందజేశారు. ఇరిద్దరు కాసేపు క్రికెట్‌ గురించి చర్చించుకున్నారు. కేటీఆర్ కు క్రికెట్ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. క్రికెట్ కు సబంధించిన విషయాలు, వీడియోలని కేటీఆర్ షేర్ చేయడం చూస్తుంటాం.

ఇక మూడో టెస్టులో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవడం హనుమ విహారి కీలక పాత్ర పోషించారు. దాదాపు 200 బంతులాడి 23 పరుగులు చేశారు. విహారికి తోడుగా రవీంద్రన్ అశ్విన్ క్రీజులో పాతుకుపోయిన సంగతి తెలిసిందే. విహారి ఇన్నింగ్స్ సెంచరీతో సమానమని.. అశ్విన్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే.