టీమిండియాకు బీసీసీఐ రూ.5కోట్ల నజరానా

ఆస్ట్రీలియాని సొంత గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు టీమిండియాని అభినందిస్తున్నారు. ఇక బీసీసీఐ టీమిండియాకు ప్రత్యేక గిఫ్ట్ ని ప్రకటించింది. రూ. 5కోట్ల నజరానాని ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ బాస్ గంగూలీ ట్విట్ చేశారు. టెస్ట్ సిరీస్ గెలుపుని అద్భుత విజయంగా అభివర్ణించిన దాదా.. విదేశీగడ్డపై అద్భుతంగా రాణించిన టీమిండియాకు రూ. 5కోట్ల బహుమానం అందజేయనున్నట్టు ట్విట్ చేశారు.

ఆఖరిదైన నాల్తో టెస్టులో టీమిండియాను 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట్లో యువ ఓపెనర్ (91), చివరలో పంత్ (89*) అద్భుతంగా ఆడి జట్టుని ముందుకు నడిపించారు. విజయాన్ని అందించారు. వీరికి పుజారా 59, రెహానె 24, సుందర్ 22 సాయం అందించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సొంత గడ్డపై 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెల్చుకుంది. టీమిండియా చరిత్ర సృష్టించింది.