ఆ పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం !

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ సీఎం జగన్. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలకు సంబంధించి మంగళవారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో విడత వైఎస్సార్ చేయూత ఇచ్చే సమయానికి మరింత ఎక్కువ మంది సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలోకి వచ్చేలా చూడాలని సూచించారు.

పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులని వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. పశువులకు సంబంధించి పూర్తి హెల్త్‌ కార్డులను కొనసాగించాలన్న ముఖ్యమంత్రి…. పశువుల ఆస్పత్రులను నాడు-నేడు తరహాలో సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇక సీఎం జగన్ ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు. హైకోర్టు కర్నూలు తరలింపు, ఇతర అంశాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారమ్.