బ్రేకింగ్ : ‘కేరింత’ నటుడుపై చీటింగ్ కేసు

‘కేరింత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు విశ్వంత్‌ దుద్దుంపూడి. ఇందులో సెకండ్ హీరోగా కనిపించాడు. దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమా యువతని ఆకట్టుకుంది. ఈ సినిమాతో విశ్వంత్ కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత మనమంతా, ఓ పిట్టకథ సినిమాల్లో విశ్వంత్ నటించారు. పలు వెబ్ సిరీస్ లోనూ నటించాడు. అయితే తాజాగా ఈ యువ నటుడిపై చీటింగ్ కేసు నమోదైంది.

అతి తక్కువ ధరకే కార్లు ఇప్పిస్తానని కొంతమంది దగ్గర విశ్వంత్ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితలంతా బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.