లూసిఫర్ రిమేక్.. మొదలైంది !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లూసిఫర్ రిమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలని జరుపుకుంది. ఈ చిత్రానికి మోహనరాజా దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్-ఆర్ బీ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌, అశ్వినీ దత్‌, డీవీవీ దానయ్య, నిరంజన్‌ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌, నాగబాబు, కొరటాల శివ, రచయిత సత్యానంద్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.చిరంజీవి కెరీర్‌లో 153వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.