స్వామిజీ కిడ్నాప్.. డబుల్ గేమ్ !

కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామీజీ ని దుండగులు కిడ్నాప్‌ చేశారు. విమానంలో షిర్డీ వెళ్దామని ఆ వ్యక్తులు స్వామీజిని నమ్మించి అపహరించారు. ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డి, సతీశ్‌ అనే వ్యక్తులు హైదరాబాద్‌ తీసుకొచ్చి.. ఆ తర్వాత బెంగళూరుకి తరలించి .. అక్కడగదిలో బంధించి డబ్బు డిమాండ్‌ చేశారట. రూ. 5 కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో వారు తిరిగి హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

దీనిపై స్వామిజీ లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేయకుండానే విడుదల చేసినట్లు స్వామిజీ ఆరోపించారు. పోలీసుల వర్షన్ మాత్రం మరోలా ఉంది.ఫిర్యాదుకు స్వామీజీ ముందుకు రాలేదన్న లంగర్‌హౌస్‌ సీఐ.. అపహరించిన వారు తన భక్తులే.. వదిలేయాలని కోరినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో స్వామిజీ డబుల్ గేమ్ అడినట్టు కనబడుతోందని చెబుతున్నారు. కేసు పెడితే.. స్వామిజీకి కొత్త చిక్కులు వస్తాయని భయపడ్డారని చెబుతున్నారు.