ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా.. ఓ అప్ డేటు !

నాగ్‌అశ్విన్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే.వైజయంతి మూవీస్‌ నిర్మించనుంది. ఇందులో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటించనున్నారు. అలాగే బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇప్పుడీ.. ఈ సినిమాకు సంబంధించిన సప్రైజ్ ఇచ్చారు నాగ్ అశ్విన్. ”జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా అప్‌డేట్‌ ఉంటుంది’ అని ట్విట్ చేశారు. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నారు. దీనితోపాటు ఆయన.. ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్‌’ చేయనున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ మొదలైంది.