దేశముదురు-రౌడీ.. మల్టీస్టారర్ ఫిక్స్ !

‘బాహుబలి’తో టాలీవుడ్-బాలీవుడ్ మధ్య హద్దులు చెరిపేశారు దర్శకధీరుడు రాజమౌళి. మన స్టార్ హీరోలు బాలీవుడ్ ని ఏలేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాగ వేసేశాడు. ఆయన దారిలో మిగితా స్టార్స్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ‘పైటర్’తోరౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్, బన్నీ.. తదితరులు కూడా పాన్ ఇండియా సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మరో భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ జరుగుతున్నట్టు సమాచారమ్. అల్లు అర్జున్- విజయ దేవరకొండల మల్టీస్టారర్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా దాన్ని తీసుకురానున్నారని తెలుస్తోంది. ‘యాత్ర’ ఫేం మహేష్‌ వి.రాఘవ్‌ వీళ్లద్దరి కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేశాడట. ఈ కథ దాదాపు ఫైనల్‌ ఫైనల్ అయినట్టు సమాచారమ్. ఈ సినిమాను బన్నీ వాసు, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మల్టీస్టారర్ పై క్లారిటీ రానుంది.

ఇక బన్నీ-విజయ్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. విజయ్ నటించిన సినిమాలని బన్నీ ప్రమోట్ చేయడం చూశాం. సినిమాలే కాదు.. పర్సనల్ గా విజయ్ స్టయిల్ అంటే బన్నీకి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పల్ ఇంటర్వ్యూలో బన్నీ చెప్పారు కూడా. ఇక విజయ్ సొంతం బ్రాండ్ రౌడీ దుస్తులని బన్నీకి గిఫ్ట్ గా వెళ్తుంటాయ్. వాటిని పంపినందుకు బన్నీ విజయ్ కి కృతజ్ఝతలు చెప్పడం చూశాం. ఇప్పుడు.. వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారంటే.. అంచనాలు మాములుగా ఉండవని చెప్పవచ్చు.