కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల ప్రకటన

తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకు రానుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం అంతా.. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై టీవీ చానెల్స్ చర్చలు జరిపాయి. తాజాగా కొత్త పార్టీ ఏర్పాటు జరుగుతున్న ప్రచారంపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, ఛానల్ మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము” అని తెలిపింది. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన లాంటిది షేర్ చేసింది. దీంతో కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల పూర్తి క్లారిటీ ఇచ్చినట్టయింది. అయితే ఇది కామా మాత్రమే పులిస్టాప్ కాదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్ లో షర్మిల కొత్త పార్టీ పెట్టడం ఖాయమని అంటున్నారు.