పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధం : వైసీపీ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్ట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్  కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఫైనల్ గా ఎన్నికలకి ఓకే చెప్పేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఎన్నికలకి సిద్ధమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  

“సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. అధికార పక్షంగా తాము పంచాయతీ ఎన్నికలకు సిద్ధమే. ఓ రాజకీయ పార్టీగా ఈ స్థానిక ఎన్నికలను వైసీపీ ఆహ్వానిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోకుండానే ఉద్యోగులు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా జరిగితే ఎస్ఈసీదే బాధ్యత” అని సజ్జల అన్నారు.