త్వరలోనే.. కరోనా ఫ్రీ భారత్ !

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,666 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. నిన్నటి  పోలిస్తే..  కొత్త కేసుల నమోదులో 8 శాతం తగ్గుదల కనిపించింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,07,01,193కి చేరింది. ఇక దేశంలో రికవరీ రేటు 97 శాతానికి చేరువకాగా.. క్రియాశీల రేటు 1.65 శాతానికి తగ్గింది.

నిన్న 14,301 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా 1,03,73,606 మంది ఆ వైరస్‌ నుంచి బయటపడ్డారు. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 1,73,740కి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 123 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,53,847కి చేరింది. దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ కూడా ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే కరోనా ఫ్రీ భారత్ ని చూడబోతున్నాం.