జనగామలో టీడీపీ నేత దారుణ హత్య వెనక కారణాలివే.. !

జనగామలో తెదేపా నేత, మాజీ కౌన్సిలర్‌ పులి స్వామి(53) దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం మార్నింగ్ వాకింగ్ కి వెళ్లిన స్వామిని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసుల కథనం ప్రకారం..  పులిస్వామి ఉదయం తన నివాసం నుంచి మార్నింగ్ వాక్ కోసం హన్మకొండ రోడ్డు వైపు వెళుతుండగా స్థానిక సోషల్ వెల్ఫేర్ హైస్కూల్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు.

ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి మారణాయుధాలతో మెడపై నరికి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పులిస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. భూ తగాదాలతోనే పులిస్వామి హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఏసీపీ వినోద్ కుమార్ తెలిపారు.