ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారు : బండి

సీఎం కేసీఆర్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు ఓ  ఓ ప్రకటన విడుదల చేశారు. పీఆర్‌సీపై సీఆర్‌ బిస్వాల్‌ కమిటీ సమర్పించిన నివేదికపై అభిప్రాయ సేకరణకు సీఎం కేసీఆర్‌ తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలనే పిలుస్తున్నారని.. వారితో మాత్రమే చర్చించి, పాలాభిషేకం చేయించుకోవాలని సీఎం తాపత్రయపడుతున్నారన్నారు.

రాష్ట్రంలోని ఉద్యోగ, పింఛనుదారులు, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను భాగస్వాములను చేసి అభిప్రాయసేకరణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 7.5శాతం ఫిట్‌మెంట్‌ను తెరపైకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ప్రస్తావన రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారమే త్రిసభ్య కమిటీ పేరుతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.