ఢిల్లీ పేలుడు.. సీసీ పుటేజ్’లో నిందితులు !


దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు నిందితులని పట్టుకొనే పనిలో పోలీసులున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పేలుడులో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు, ఏరోస్పేస్‌ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు.