గాంధీ సరికొత్త పోరాట మార్గాన్ని చూపారు : కేసీఆర్

జనవరి 30 – మహాత్మగాంధీ వర్థంతి. ఈ సందర్భంగా మహాత్ముడికి నివాళ్లులు అర్పించారు సీఎం కేసీఆర్. శనివారం గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులు అర్పించారు. సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్పిందని.. ఆయన ఆదర్శప్రాయుడని తెలిపారు.

ప్రార్థన, అభ్యర్థన, నిరసనతో జాతిపిత మహాత్మా గాంధీ సరికొత్త పోరాట మార్గాన్ని చూపారన్నారు. అహింసా, సత్యాగ్రహంతో మహాత్ముడు స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారన్నారు. దేశం కోసం గాంధీ తన జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. గాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణదినంగా జరుపుకుంటున్నామని కేసీఆర్‌ అన్నారు.