దాదా హెల్త్ బులిటెన్

ఛాతీలో నొప్పితో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ బుధవారం రెండోసారి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు రెండు స్టెంట్లు అమర్చాలని నిర్ణయించారు. గురువారం సాయంత్రం యాంజియోప్లాస్టీ చేసి రెండు స్టెంట్లు అమర్చారు.

‘డాక్టర్‌ అఫ్తాబ్‌ ఖాన్‌, డాక్టర్‌ అశ్విన్‌ మెహతా, డాక్టర్‌ దేవిశెట్టి, డాక్టర్‌ అజిత్‌ దేశాయ్‌, డాక్టర్‌ సప్తర్షి బసు 2021, జనవరి 28న గంగూలీకి విజయవంతంగా యాంజియోప్లాస్టీ చేశారు’ అని గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం గంగూలీ హెల్త్ బులిటెన్ ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 
గంగూలీ పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శుక్రవారం ఆయనను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లోని ప్రత్యేక గదికి తరలించినట్టు చెప్పారు. ప్రస్తుతం దాదా బాగున్నారని వెల్లడించారు.