పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈసారి పదో తరగతి పరీక్ష పేపర్లని కుదిరించారు. గతంలో మాదిరిగా ఒక్కో సబ్జెక్ట్ కి రెండు పేపర్లు కాకుండా.. ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కో పరీక్షని మాత్రమే నిర్వహించనున్నారు. మొత్తంగా 7 పరీక్షలని నిర్వహించనున్నారు.

ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సైన్సు సబ్జెక్టుకు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. సైన్సులో ఒక్కో పేపరుకు 50 మార్కులు కేటాయించారు. మరోవైపు పదో తరగతి విద్యార్థులకు జూన్ ఐదో తేదీ వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.