శాకుంతల స్నేహితురాలిగా ఈషా 

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్‌ లవ్‌స్టోరీ ‘శాకుంతలం’. ఇందులో సమంత టైటిల్‌ రోల్‌ పోషించనున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె శాకుంతల, దుష్యంతుల ప్రేమకథను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించబోతున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ‘శాకుంతలం’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శాకుంతల  స్నేహితురాలిగా యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా ని తీసుకున్నట్టు సమాచారమ్.

ఇప్పటికే ఈషా రెబ్బ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. స్టార్ డమ్ తెచ్చుకోవడం కోసం ఈషా గ్లామర్ డోస్ పెంచేందుకు ఓకే చెప్పేసింది. ఈ మేరకు దర్శక-నిర్మాతలకి సంకేతాలు పంపింది. ప్రస్తుతం ఈషా  `లస్ట్ స్టోరీస్`కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన `పిట్ట కథలు` వెబ్ సిరీస్‌తో ఈషా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా ఓ హాట్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.