తెలంగాణ క్రికెట్ జట్టులో హీరోయిన్ చేరిక

ఇప్పుడు మహిళా క్రికెట్’కు ఆదరణ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. టీంమిండియా మహిళా జట్టు దేశ-విదేశాల్లో అదరగొడుతోంది. మిథాలీ సేన ఇచ్చిన స్పూర్తితో మహిళలు క్రికెట్’ని కెరీర్ గా ఎంచుకొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ లిస్టులో హీరోయిన్ రష్మిక మందన కూడా చేరిపోయింది. ఆమె తెలంగాణ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఆడే స్థాయికి చేరుకొంది. ఐతే, ఇదంతా విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం.

కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన జంటగా ‘డియర్ కామ్రేడ్’ తెరకెక్కనుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఒక క్రికెటర్ గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం హైదరాబాద్ క్రికెట్ క్లబ్ లో శిక్షణ పొందుతోంది. ఈ సినిమా జూన్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.