కియారా పోజు.. కేక !


తెలుగు ప్రేక్షకులని బాగా దగ్గరైన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ. మహేష్ ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో నటించింది. ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రిమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. దీంతో తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినా.. అంగీకరించని పరిస్థితి.

సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కైరా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంటుంది. తాజాగా గ్లామర్ షో చేస్తూ పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ.. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా పోజు.. కేక్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం కియారా బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.