‘సర్కారి వారి పాట’ లొకేషన్స్ పిక్స్ షేర్ చేసిన మహేష్


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా లొకేషన్స్ ఫోటోలని షేర్ చేశారు మహేష్. ప్రస్తుతం Sharjah’s Mleihaలో ఉన్నాం. లోకేషన్ అద్భుతంగా ఉందని కామెంట్ పెట్టారు. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాంక్ దోపిడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కసరత్తులు చేశాడు. స్లిమ్ గా తయారయ్యారు. మునుపెన్నడూ.. లేని విధంగా యంగ్ లుక్ లోకి మారిపోయారు.