నిమ్మగడ్డకు అనారోగ్యం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేటి జిల్లాల పర్యటన రద్దయింది. కంటి ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఎస్‌ఈసీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించడానికి ఇవాళ కడప, అనంతపురం, కర్నూలులో పర్యటించాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య ఓ రకమైన వార్ కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఈ వార్ లో ఇప్పటివరకైతే.. నిమ్మగడ్డదే పైచేయి. మరీ.. సీఎం జగన్ క్లైమాక్స్ ట్విస్ట్ లాంటిది ఏమైనా ఇస్తారేమో చూడాలి.