మీడియా ముందే ఏడ్చేసిన అచ్చెన్నాయుడు

ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.  జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్న భావోద్వేగానికి గురయ్యారు. సంబంధంలేని విషయంలో తప్పుడు కేసులు పెట్టారని కంటతడి పెట్టారు.

రాష్ట్రంలో జగన్‌ మోహన్‌రెడ్డికి, వైకాపాకు కింజరపు కుటుంబం గుదిబండలా తయారైందని వ్యాఖ్యానించారు. మరోవైపు బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడికి నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  సొంతూరు నిమ్మాడగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.