మెగాస్టార్ అభిమానులకి గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కూడా మూడ్నాలుగు సినిమాలని లైన్ లో పెట్టేశారు. ఇందులో బాబీ సినిమా ఒకటి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. తాజాగా ఓ వెబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైత్రీ మూవీస్ నిర్మాతలు మెగాస్టార్-బాబీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. బాబీ దర్శకత్వంలో రానున్న మెగాస్టార్ సినిమా మాములుగా ఉండదు. పక్కా కమర్షియియల్.. ఫ్యాన్స్ కి కంప్లీట్ ట్రీట్  అని చెప్పుకొచ్చారు.

ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ ఆ స్టయిల్ లో బాబీ-చిరు సినిమా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ‘ముఠా మేస్త్రీ’ మించేలా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చుస్తున్నామని మైత్రీ నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఆచార్య, లూసిఫర్ రిమేక్ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు సినిమా ఉండనుంది.

మెగాస్టార్ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని-బాలయ్య, పవన్ కల్యాణ్-హరీష్ శంకర్, ఎన్ టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఇక మైత్రీ నిర్మించిన ఉప్పెన రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. వైష్ణవ్ తేజ్-కృతీ శెట్టి జంటగా నటించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నారు.