‘లైగర్’ రిలీజ్ డేట్ చెప్పేశారు

దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి విజయ్ దేవరకొండ బాలీవుడ్ ని దున్నేయడానికి రెడీ అయ్యాడు. వీరి కాంబోలో ‘లైగర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్. పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. సెప్టెంబర్ 9న లైగర్ నిప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపింది. రిలీజ్ డేటుని ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో విజయ్ గర్జిస్తున్నారు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో బోల్డ్ నటనతో టాలీవుడ్ సంచలనంగా మారాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు లైగర్ సినిమాతో బాలీవుడ్ షేక్ చేయడం ఖాయం. టాలీవుడ్ నుంచి రాబోతున్నమరో పాన్ ఇండియా హీరో విజయ్ నే అని చెప్పుకుంటున్నారు. ఇక టాలీవుడ్ స్టార్స్ ఎన్ టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు.. కూడా పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. పాన్ ఇండియా కథలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే.. టాలీవుడ్-బాలీవుడ్ కలిసిపోవడం ఖాయమేమో.. !