అర్జున్‌ తెందుల్కర్‌కు నిరాశ 

ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్‌ వేలంలో పేరు నమోదు చేసుకున్న క్రికెటర్‌ సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విజయ్‌ హజారె వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబయి సీనియర్‌ జట్టులో అర్జున్ చోటు దక్కించుకోలేకపోయాడు.

ఈ నెల 20న ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం ముంబయి క్రికెట్‌ సంఘం బుధవారం 22 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారి ముంబయి సీనియర్‌ జట్టుకు ఎంపికైన అర్జున్‌.. ఆ టోర్నీలో రాణించలేకపోయాడు. దీంతో విజయ్‌ హజారె ట్రోఫీ జట్టు నుంచి అతణ్ని తప్పించారు.