పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల గంట మ్రోగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ని తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలకానుంది. తెలంగాణలోని నల్గొండ-వరంగల్-ఖమ్మం, మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాలకి మార్చి 14ల పోలింగ్ జరగనుంది.

ఎన్నికల షెడ్యూల్ :

* ఫిబ్రవరి 18 – ఎన్నికల నోటిఫికేషన్

* ఫిబ్రవరి 23 –  నామినేషన్లకు గడువు

*  ఫిబ్రవరి 24 – నామినేషన్ల పరిశీలన

* ఫిబ్రవరి 26 – నామినేషన్ల ఉపసంహరణకు గడువు

*  మార్చి 14 – పోలింగ్ (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

* మార్చి 17 – ఓట్ల లెక్కింపు-ఫలితాలు