వైరల్ : యముడికి కరోనా టీకా

జనవరి 16 నుంచి దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా కరోనా టీకాని అందిస్తున్నారు. మొదట కరోనా వారియస్ కి టీకా ఇస్తున్నారు. అయితే కరోనా టీకా తీసుకొన్న వారిలో కొందరు అస్వస్థతకి గురవుతున్నారు. పలువురు మృతి చెందారు కూడా ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకోవడానికి జనాలు ఆలోచిస్తున్నారు. భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ విన్నూత ప్రచారం చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో ఓ కేంద్రంలో కరోనా టీకా పంపిణీ జరుగుతోంది. ఇక్కడకు యుముడి వేషధారణలో ఓ వ్యక్తి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చేతిలో గద, నెత్తిపై కిరీటం, కళ్లకు గ్లాసెస్, వెరైటీ డ్రెస్ ధరించి ఉన్న ఆ వ్యక్తిని చూసి నోరెళ్లబెట్టారు. అసలు రియన్ యముడు కాదు. యముడు అవతారంలో ఉన్న కానిస్టేబుల్ జవహార్ సింగ్. కరోనా టీకాను అందరూ వేయించుకోవాలని తాను ఈ విధంగా చేసినట్లు తెలిపారు.