ప్రకాజ్ రాజ్ పొలిటికల్ సటైర్.. వైరల్ !

కర్ణాటక రాజకీయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్’గా మారింది. కర్ణాటకలో మేజిక్ ఫిగర్ అందుకొని భాజాపాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతిని ఇవ్వడం. ఆ నిర్ణయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తప్పుపట్టడం తెలిసిందే.రేపే శాసనసభలో యెడ్డీ బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం ఆదేశించింది. దీంతో కర్ణాటక రాజకీయాలు మరింత హీటెక్కాయి.

తాజాగా, కర్ణాటక రాజకీయాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ‘కర్ణాటక.. బ్రేకింగ్‌ న్యూస్‌.. ప్రియమైన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులారా.. రాష్ట్రాన్ని వెంటనే అభివృద్ధి చేసేయాలని తొందరపడకండి. ముందు మీరేంటో?, మీ బలం ఎంతో రేపు సాయంత్రం 4 గంటలకు నిరూపించుకోండి. సుప్రీం కోర్టు.. సుప్రీంగా వ్యవహరించింది’ అని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.