సామాన్యులే మా మిత్రులు.. వారి కోసమే ఈ బడ్జెట్ !

పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్‌ తీసుకొచ్చిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టిగా సమాధానం ఇచ్చింది. తమకు మిత్రులంటే ఈ దేశ సామాన్య ప్రజలేనని, వారికోసమే బడ్జెట్‌ రూపొందించామని తెలిపారు. బడ్జెట్‌పై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

‘ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే బడ్జెట్‌ తెచ్చామని విపక్షాలు అంటున్నాయి. కానీ మా ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేయట్లేదు.. మాకు మిత్రులంటే ఈ దేశ సామాన్య ప్రజలే. వారి కోసమే ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది’ అని నిర్మల అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌.. భారత్‌ ఆత్మనిర్భర్‌గా అవతరించేందుకు బాటలు వేస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు.