రోహిత్ వాలంటైన్ గిఫ్ట్’కు రితికా ఫిదా

చెపాక్‌ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ పరుగుల వరద పారించాడు. 231 బంతుల్లో 161 పరుగులు చేశాడు. 18 బౌండరీలు 2 సిక్సర్లు బాదేశాడు. ఐతే పిచ్‌పై విపరీతంగా టర్న్‌ ఉండటం, మొయిన్‌ అలీ ప్రమాదకరంగా బంతులు వేయడంతో శతకం ముంగిట హిట్‌మ్యాన్‌ ఇబ్బంది పడ్డాడు.

రోహిత్‌ 97 పరుగుల వద్ద ఉండగా మొయిన్‌ అలీ, స్టువర్ట్‌ బ్రాడ్ అవుట్ చేసినంత పని చేశారు. స్వీప్‌ చేసే క్రమంలో ఫీల్డర్ల ముంగిట బంతులు గాల్లోకి లేచాయి. ఆ సమయంలో గ్యాలరీలో ఉన్న రోహిత్‌ సతీమణి రితికా సజ్దె ఆందోళనకు గురైంది. ఫింగర్స్‌ క్రాస్‌ చేసి కూర్చొంది. శతకం చేశాకా ఫింగర్స్‌ క్రాస్‌ చేసే కరతాళధ్వనులు చేయడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారాయి.

అంతేకాదు.. రోహిత్ 161 రితికాకు ఇచ్చిన వాలంటైన్ డే గిఫ్ట్ గా బీసీసీఐ పేర్కొంది. అంతేకాదు.. గతంలో రితికాకు రోహిత్ ఇచ్చిన గిఫ్ట్ లని కూడా గుర్తు చేసింది.శ్రీలంకపై రోహిత్ 208 పరుగులు చేసి రితికాకి పెళ్లిరోజు గిఫ్ట్ ఇచ్చాడు. అదే జట్టుపై 118 పరుగులు చేసి.. రితికాకు బర్త్ డే గిఫ్ట్ అందజేశారు. 2018లో ఇంగ్లండ్ పై 115 పరుగులు చేసిన రితికాకి వాలంటైన్ డే గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా 161 పరుగులతో ఈ  యేడాది భార్యకి రోహిత్ వాలంటైన్ గిఫ్ట్ ఇచ్చాడని బీసీసీఐ ట్విట్ చేసింది. ఇక తొలిరోజు ఆటలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్ (33), అక్షర్ పటేల్ (13) ఉన్నారు.