రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 482 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 164 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. టీమిండియా 317 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 3, కుల్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ లో మొయిన్ అలీ 43 టాప్ స్కోరర్. కెప్టెన్ రూట్ 33, బర్న్స్ 25, లారెన్స్ 26 పరుగులు చేశారు. అయితే మొదటి నుంచి టీమిండియా బౌల‌ర్లు ఆధిపత్యం చలాయిస్తూ వచ్చారు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకుండా.. వికెట్లు ‌తీశారు. స్పిన్ కు అనూకులిస్తున్న పిచ్ పై బ్యాటింగ్ చేయడం ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ కి కష్టంగా మారింది. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్ అశ్విన్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే.