TSలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడ్రోజులుగా తెలంగాణలో వందలోపే కరోనా కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయ్. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 163 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. మరోఇద్దరు కరోనాతో మృతి చెందారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. బుధవారం ఇద్దరు కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,622 మంది కరోనా కారణంగా మృతిచెందారు. ప్రస్తుతం తెలంగాణలో 1,700 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,93,791 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.