కొత్త సినిమాని ప్రకటించిన నితిన్

హీరో నితిన్ కొత్త సినిమాని ప్రకటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ట్విట్ చేశాడు. ఈ చిత్రాన్ని శ్రేష్టమూవీస్ నిర్మించనుంది. తమన్నా, నభా నటాషా హీరోయిన్స్ గా నటించనున్నారు. సినిమా ప్రకటనతో పాటు రిలీజ్ డేటుని కూడా ప్రకటించడం విశేషం. జూన్ 11న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

ఇక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన ‘చెక్’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీగా నితిన్ కనిపించనున్నారు. ఈ కథని కేవలం 10 నిమిషాలు విని ఓకే చేశానని నితిన్ చెప్పిన సంగతి తెలిసిందే.