ఉమేశ్ యాదవ్ ఫిట్


టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఉమేశ్ యాదవ్ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు ఉమేశ్ ఎంపికయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. మూడో టెస్టు తుదిజట్టులో చోటు కోసం హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో ఉమేశ్ యాదవ్‌ పోటీపడాల్సి ఉంది. కాగా.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఉమేష్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ తో ఆఖరి రెండు టెస్టులకి భారత  జట్టు :

విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌