నితిన్ సినిమాకు తారక్ ప్రమోషన్

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్. రేపే (ఫిబ్రవరి 26) ‘చెక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన దక్కింది. విభిన్న సినిమాలు తీసే చంద్రశేఖర్ ఏలేటి నుంచి మరో మంచి సినిమా రాబోతుందని హింట్ ఇచ్చాయ్. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్.

ఇప్పుడీ.. ఈ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమోట్ చేశారు. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేని ప్రతిభని గుర్తు చేస్తూ.. చెక్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ తారక్ ట్విట్ చేశారు. ‘ఎప్పటి నుంచో యూనిక్ థీమ్, స్టోరీ టెల్లింగ్ తో ఆకట్టుకొనే చంద్రశేఖర్ యేలేటికి అభిమానిని. చెక్ సినిమా సూపర్ గా ఉండబోతుందని అనిపిస్తోంది. చందు మరియు చెక్ చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అంటూ తారక్ రాసుకొచ్చారు.

ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో కొమరం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నారు. ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటించనుంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోనున్నట్టు సమాచారమ్. విలన్ గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోనున్నారని టాక్.