ఒకే ఫ్రేములో చరణ్-తారక్-మహేష్.. అదిరిపోయింది !

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పిక్ హల్ చల్ చేస్తోంది. రామ్ చరణ్-ఎన్టీఆర్-మహేష్ బాబు సరదాగా నవ్వుకొంటున్న ఈ ఫోటో నెట్టింట వైరల్’గా మారింది. ఇప్పుడీ ఫోటోని చూసి ట్రిపుల్ స్టార్స్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరికొందరైతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న తారక్-చరణ్’ల మల్టీస్టారర్’లో మహేష్ కనిపించబోతున్నట్టున్నాడు. దీనిపైనే ట్రిపుల్ స్టార్స్ ముచ్చటించుకొంటున్నారని చెప్పుకొంటున్నారు.

అప్పుడప్పుడూ ఈ ట్రిపుల్ స్టార్స్ ఇలా కలుసుకొంటే వారు, ఆ ఫోటోలు బయటికొస్తే వారి అభిమానులు రిలాక్స్ అవుతారు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి సినిమాతో, తారక్ త్రివిక్రమ్ సినిమా ‘అరవింద సమేత’తో బిజీగా ఉన్నారు. మహేష్ ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ టూర్ కి వెళ్లాడు. తిరిగొచ్చాక వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 25వ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.