నాగ్ స్థానంలో హోస్ట్ గా ఎన్టీఆర్

కింగ్ నాగార్జున స్థానంలో హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అలాగని బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కోసం మళ్లీ తారక్ వస్తున్నారు అనుకునేరూ. గతంలో నాగార్జున హోస్ట్ గా ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’ షో ప్రసారమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి కూడా హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడీ.. ఈ కార్యక్రమాన్ని జెమినీ టీవీ ‘ఎవరు మీలో కోటిశ్వరులు’ అంటూ సరికొత్తగా తీసుకురానుంది.


తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని జెమినీ టీవీ విడుదల చేసింది. ఇందులో చైర్‌లో హోస్ట్ కూర్చుని ఉన్నాడు. అయితే, ఆయ‌న ముఖాన్ని నేరు చూప‌కుండా నీడ‌లా చూపించారు. దాన్ని గ‌మ‌నించి చూస్తే ఎన్టీఆర్ ఆ కుర్చీలో కూర్చున్నట్లు అర్థ‌మ‌వుతోంది. ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’కు సంబంధించిన ప్రోమోల షూటింగ్ కొన‌సాగుతోంది. ఈ షో కోసం తారక్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. తారక్ కి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో తారక్ నటించనున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ – త్రివిక్రమ్ సినిమాల గ్యాప్ లో ఎవరు మీలో కోటిశ్వరులు కోసం తారక్ కేటాయించబోతున్నట్టు సమాచారమ్. 

The Biggest and Most Entertaining show, #EvaruMeeloKoteeswarulu is coming soon to your favorite Gemini TV.
“Evaru Meelo Koteeswarulu ” can make your dreams come true. Watch this space for more details. Coming soon #GeminiTV #EvaruMeeloKoteeswaruluonGeminiTV #EMKonGeminiTV pic.twitter.com/WoX8XhVHjc— Gemini TV (@GeminiTV) March 7, 2021