కాలుకు గాయంపై స్పందించిన నిఖిల్

‘కార్తికేయ2’ షూటింగ్‌లో హీరో నిఖిల్ గాయపడ్డ సంగతి తెలిసిందే. గుజరాత్‌లో షెడ్యూల్ లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా నిఖిల్ ఎడమ కాలుకు గాయమైంది.ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు కంగారు పడ్డారు. అభిమానులు, సినీ ప్రముఖులు నిఖిల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తాజాగా ప్రమాదంపై నిఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నాకు ప్రమాదం జరిగిందని తెలుసుకొని చాలా మంది ఫోన్స్, మెసేజ్‌లు చేస్తున్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. రెట్టింపు ఉత్సాహంతోనే త్వరలో మీ ముందుకు వస్తాను” అంటూ నిఖిల్ ట్విట్ చేశారు.

ఏడేళ్ల క్రితం చందూ మొండేటి-నిఖిల్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కార్తికేయ’. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ.. ఈ సినిమా సీక్వెల్‌ గా కార్తీకేయ 2 ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాదిలోనే కార్తీకేయ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Suffered a Left Calf Muscle Tear during the filming of an Action Sequence in Gujarat for #Karthikeya2
Receiving lots of Concerned calls and messages… Hugeee thanks to u all for the Love ❤️ and Energy being sent to me… Will Bounce back with Double the Enthusiasm 💪🏼😇 pic.twitter.com/Tl5clbhokA— Nikhil Siddhartha (@actor_Nikhil) March 11, 2021