సిక్కింలో సరదాగా.. చిరు-మోహన్ బాబు !

మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కలిస్తే ఆ సందడే వేరు. ముద్దులు, హగ్గులతో హెడ్ లైన్స్ లోకి దిగిపోతారు. అలాంటిది వీరిద్దరు కలిసి టూర్ కి వెళ్తే ఎలా ఉంటుంది ? దాన్ని ఊహించడం కూడా కష్టమేమో. ఈ వీకెండ్ లో చిరు-మోహన్ బాబు  కలిసి సిక్కిం టూర్ కి వెళ్లారు. అక్కడ ఫోటోలకి పోజులిచ్చారు. ఇప్పుడీ.. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం చిరు, మోహన్ బాబు ఇద్దరు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మోహన్ బాబు విషయానికొస్తే.. గుణశేఖర్ శాంకుతలమ్ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించనున్నారు. ఇక చాన్నాళ్లనుంచి చిరు-మోహన్ బాబు మరోసారి కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆ కోరిక త్వరలోనే తీరనుందని సమాచారమ్.