నాలోనూ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది.. నాది కామెడీ ఫేస్‌ కాదు : లావణ్య

మీడియం రేంజ్ హీరోలకు స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఇటీవలే ‘ఏ1 ఎక్స్ ప్రెస్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కార్తికేయతో కలిసి ఆమె నటిస్తోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కొత్త దర్శకుడు కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మాత. మార్చి 19న విడుదల కానుంది.


ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి సినిమా, తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ పెళ్లయిన అమ్మాయి విడో కావడం ఆ తర్వాత అమ్మాయిని బస్తీ బాలరాజు (కార్తికేయ) ప్రేమించడం అనేది భిన్నంగా ఉంటుంది. ఈ పాత్రకి నా నిజజీవితంలోని పాత్రకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో పాత్ర పేరు మల్లిక. వైజాగ్‌ అమ్మాయిగా కనిపించనున్నా. ఇదొక ఛాలెంజ్‌ పాత్ర. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. అంతేకాదు సినిమాలో హాస్యంతో పాటు సందేశం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.