ట్రెండింగ్ టాప్’లో మేజర్ ఫస్ట్ గ్లింప్స్

అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. ఈ చిత్రానికి గూఢచారి ఫేం శశికిరణ టిక్కా దర్శకుడు. శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ నెల 28న మేజర్ టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. ఇప్పుడు యూట్యూబ్ లో మేజర్ ఫస్ట్ గ్లింప్స్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. సింగిల్ సీన్ తో కట్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మేజర్ ఫస్ట్ గ్లింప్స్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతుందని మహేష్ బాబు ట్విట్ చేశారు. ఆనందం వ్యక్తం చేశారు.