TS అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు !

సీనియర్ నేత, తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడ ఉంటే.. అక్కడ సంచలనమే. తాజాగా జేసీ తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ప్రత్యక్ష్యమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిలతో పిచ్చాపాటిగా మాట్లాడారు. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని నాశనం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొందరికి సీఎం పదవి, ముఖ్య పదవులపై వ్యామోహంతో పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు. రాలేదన్నారు. 


తెదేపా అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు అందడంపై కూడా జేసీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ఒక్క నోటీసు మాత్రమే అందించారు. కానీ సీం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలకు నోటీసులు ఇవ్వాలంటే లారీల్లో పంపించాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. మొత్తానికి.. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన హంగామా.. ఈరోజు టాక్ ఆఫ్ ది డే గా మారింది.