ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

శాసనసభ వేదికగా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్‌సీ ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్‌సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో గత పీఆర్‌సీ ద్వారా వెల్లడించామన్నారు.

గవర్నర్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది. దేశంలోనే అత్యధిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యోగులు గర్వంగా చెప్పుకునే విధంగా వేతనాలు ఇస్తామని ఉద్యమ సమయంలో చెప్పాం. ఇప్పటికే అమలు చేస్తున్నాం. తాజాగా మరో పీఆర్‌సీ ప్రకటించిన తర్వాత మరోసారి ఉద్యోగులపై తెరాస వైఖరి ఎలా ఉందో దేశమంతా తెలుసుకుంటుంది’ అని అన్నారు.