కేపీహెచ్‌బీ వాసులకి కేటీఆర్ గుడ్ న్యూస్

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ వాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. కేపీహెచ్‌బీలో ఇళ్ల పునర్మిర్మాణానికి ఉచితంగా అనుమతులు కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇక టీఎస్‌ బీపాస్‌ ప్రారంభించిన 100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. మంత్రి 600 గజాల వరకు స్వయం దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్ అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ ధ్రువపత్రం సైతం జారీ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.