కరోనా విజృంభణ.. ఎమ్మెల్యేలని అలర్ట్ చేసిన స్పీకర్ !

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 364 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1666కి చేరింది. టీచర్లు, పాఠశాల విద్యార్థులు కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


ఈ నేపథంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఎమ్మెల్యేలని అలర్ట్ చేశారు. ఎమ్మెల్యేలందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పోచారం సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు కరోనా సోకి ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో కరోనా పట్ల ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని స్పీకర్ సూచించారు.