ఐదో టీ20 : రాహుల్ స్థానంలో ఇషాన్ ?

ఇంగ్లాండ్ తో టీమిండియా ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో మొదలు కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం కెఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ ని తీసుకోవాలనే విజ్ఝప్తులు ప్రేక్షకులు, మాజీ క్రికెటర్ల నుంచి వస్తున్నాయి. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో అతడికి బదులు ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.


ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్లూ హోరాహోరీ తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం చెరో రెండు విజయాలతో సమానంగా నిలవడంతో అందరి ఆసక్తీ ఇప్పుడు ఫైనల్‌పై పడింది. ఇక ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి పొట్టి కప్పును సాధించాలని చూస్తుండగా, మరోవైపు టీమ్‌ఇండియా నాలుగో టీ20లో అద్భుత విజయం సాధించడంతో పోటీలో బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లోనూ టాస్ కీలకం కానుంది. ఈ సిరీస్ లో టాస్ గెలిచిన వారిదే విజయం అన్నట్టుగా ఉంది. తొలి బ్యాటింగ్ చేసిన టీమ్ ఓడిపోతుంది. అయితే ఈ సెంటిమెంట్ కు నాల్గో టీ20లో టీమిండియా చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. గెలిచింది. టైటిల్ పోరులో నిలిచింది.