విషాదం : తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక శ్రీశైలం (21) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకలపల్లికి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం మల్లన్న టీమ్ లో పని చేశాడు. మల్లన్న నిర్వహించిన పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. 


శ్రీశైలం ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు తుదిశ్వాస విడిచాడు. శ్రీశైలం మృతిపై తీన్మార్ మల్లన్న స్పందించారు. 

తమ్ముడు శ్రీశైలం తనతోపాటు అడుగులో అడుగువేస్తూ పాదయాత్రలో పాల్గొన్నాడని, తన టీమ్‌లో ఒక సభ్యుడుగా పనిచేశాడన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని తిరిగిన సోదరుడు దూరం కావడం చాలా బాధగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు.