నాకు దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న కుటుంబం : తారక్

కీరవాణి తనయుడు శ్రీసింహ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ జెల్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు. మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఈ సినిమా ప్రిరిలీజ్‌ వేడుకకు తారక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. “నాకు ఇరవయేళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే.. నాకు దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న, కీరవాణి కుటుంబం. నా జీవితంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాల వెనుక ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీళ్లు ఉంటారు. ఈ కుటుంబానికి నేనెప్పుడూ అతిథిని కాను. నేనూ వాళ్ల కుటుంబ సభ్యుడిగానే భావిస్తాను” అని ఎమోషనల్ అయ్యారు.