సూర్యపేటలో నిర్వహిస్తున్న.. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశృతి !

సూర్యపేటలో నిర్వహిస్తున్న 47వ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. గ్యాలరీ కుప్పకూలడంలో దాదాపు 50 మందికి గాయలయ్యాయ్. వీరిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగినట్టు సమాచారమ్. 


ప్రమాద సమయంలో దాదాపు 1500 మంది ఉన్నట్టు సమాచారమ్. సామార్థ్యానికి మించి అనుమతి ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారమ్. సూర్యపేటలో ఈరోజు నుంచే క్రీడలు ప్రారంభం అయ్యాయ్. కబడ్డీపోటీలు ప్రారంభమైన ఆరు నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. అప్పుడప్పుడే చీకటి పడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎవరికి ప్రాణపాయం లేదు. కానీ కొందరికి కాళ్లు, చేతులు విరిగాయని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.